Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని ఈస్ట్ఆనంద్బాగ్ ఆర్యూబీ పనులను త్వరితగతిన పూర్తి చేసి, స్థానికులకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం కార్పొరేటర్ జగదీష్గౌడ్లతో కలిసి ఆర్యూబీ పనులను పరిశీలించారు. కాంట్రాక్టు దారులు, అధికారులు, కోఆర్డినేషన్ చేసుకుని వీలయినంత త్వరగా ఆర్యూబీ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అదే విధంగా సర్వీసు రోడ్డు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పనులను వేగవంతంగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్కుమార్, కార్పొరేటర్ బద్దం పరుశురాంరెడ్డి, జీఎన్వీ. సతీష్, లక్ష్ష్మీకాంత్రెడ్డి, రావుల అంజయ్య, అశోక్, సత్తిరెడ్డి, మబ్బు పాల్గొన్నారు.