Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసిస్టెంట్ ఎన్నికల అధికారి సీహెచ్ కృష్ణయ్య
- ఓట్ల లెక్కింపు రోజున 144 సెక్షన్
నవతెలంగాణ-అంబర్పేట
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు పనులను అస్టిస్టెంట్ ఎన్నికల అధికారి సీహెచ్ కృష్ణయ్య పరిశీలించారు. ఈ కౌంటింగ్కు నారా యణగూడలోని రెడ్డి మహిళా కళాశాల వేదిక కానుంది. అధికారులు కౌంటింగ్ ప్రక్రియ కోసం ముమ్మర ఏర్పాట్లలో నిమగమయ్యారు. ఈ మేరకు నియోజకవర్గం అసిస్టెంట్ ఎన్నికల అధికారి సీహెచ్. కృష్ణయ్య నేతత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివరాల్లోకెళ్తె.. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక ఓట్ల లెక్కింపుపై అధికారులు దష్టి సారించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను నారాయణ గూడలోని రెడ్డి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భారీ బందోబస్తు మధ్య భద్రపరిచారు. దీన్ని పోలీసులు, జిల్లా ఎన్నికల అధికా రులు దగ్గరుండి పరిశీలించారు. అనంతరం అసిస్టెట్ రిటర్నింగ్ అధికారితో చర్చించి, ఎలాంటి ఇబ్బదులు రాకుండా చూడాలని ఆదేశించారు. అభ్య ర్థులు, ఏజెంట్లు పాటించాల్సిన నియమ నిబంధన లను వారికి వివరించారు. ఓట్ల లెక్కింపు రోజున 144 సెక్షన్ ఉంటుందని ఆయన ప్రకటించారు.
కౌంటింగ్కు ఎన్నికల అధికారులు తీసుకునే జాగ్రత్తలు..
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లకు మూడు అంచెల పటిష్ట భద్రతతో పాటు, లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటుచేశారు. రిటర్నింగ్ అధికారికి ప్రత్యేక టేబుల్ ఉంటుంది. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. ఇప్పటికే లెక్కింపు సిబ్బందికి రెండు విడతల శిక్షణ పూర్తి చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఆర్వో కింద ఉంటుంది. కౌంటింగ్ ఏజెంట్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చారు. ప్రతి టేబుల్కు ఒక కౌంటింగ్ ఏజెంట్, మొబైల్ ఫోన్లు, పేపర్లను కౌంటింగ్ హాల్లోకి అనుమతించరు.ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతోంది. కౌంటింగ్ పూర్తి అనంతరం డ్రా ద్వారా ఎంపిక చేసిన ఐదు వీవీప్యాట్లను ఒకటి తర్వాత ఒకటిగా అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో వీవీప్యాట్లోని ముద్రిత ఓటర్ స్లిప్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రక్రియను సీసీటీవీ ద్వారా ఎన్నికల అధికారి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, భారత ఎన్నికల సంఘం కూడా పర్యవేక్షించేందుకు అవకాశం కల్పించామన్నారు. అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గంలోని 236 పోలింగ్ బూత్లలో ఓట్లను 17 రౌండ్లలో లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, రౌండ్ రౌండ్కు వచ్చే ఫలితాలను చెప్పెందుకు డిజిటల్ స్క్రీన్, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేస్తున్నట్టు అసిస్టెంట్ ఎన్నికల అధికారి తెలిపారు.