Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తోనే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యఅందుతోందని టీఎస్ఎంఎస్ఫ్ రాష్ట్ర అధ్యక్షలు కొల్లురూ వెంకటేష్ మాదిగ అన్నారు. మంగళవారం ఓయూ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రవీణ్కుమార్పై అసత్య, అబద్ధపు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు. ఆర్.ఎస్ప్రవీణ్ కుమార్ రాకముందు గురుకుల విద్యా సంస్థలు బ్రష్టు పట్టి పోయాయని, ఆయన వచ్చాకనే అనేక సంస్కరణలు తీసుకు వచ్చి ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ గురుకులాలు నడిపిస్తున్నారని వివరించారు. ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని హాస్టల్ పిల్లలు అధిరోహించి మన రాష్ట్ర కీర్తిని ప్రపంచం నలుమూలల చాటారన్నారు. ఈ సాహస యాత్ర వెనుక ప్రవీణ్ కుమార్ అసమాన కషి మరువ లేదన్నారు. అణగారిన వర్గాల పిల్లల అభివృద్ధిని ఓర్వలేని కొద్దిమంది మనువాదులు కార్పొరేట్, ప్రయివేటు విద్యా సంస్థలతో కుమ్మక్కై ప్రవీణ్ కుమార్పై ఆరోపణలు చేస్తున్నారు. ఈ కార్య క్రమంలో టీఎస్ ఎంఎస్ఫ్ విద్యార్థులు పాల్గొన్నారు.