Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
ఆడుకుంటూ భవనంపై నుంచి ప్రమాదవశత్తు జారి పడి చిన్నారితో పాటు మరో వ్యక్తి తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మునగనూర్లో మంగళవారం చోటు చేసుకున్నది. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రహ్మణ కొత్తపల్లికి చెందిన జెల్ల వెంకటేష్, భార్య మంజుల ఇద్దరు పిల్లలు భవ్య(11), బాలాజీ(13)తో కలిసి అబ్దుల్లాపూర్మెట్ మండలం మునగనూర్లో నివాసం ఉంటూ పెయిం టింగ్ పని చేస్తున్నాడు. వెంకటేష్ ఉంటున్న రెండవ అంతస్తులోని ప్రక్క పోర్షన్లో కర్నూల్ జిల్లాకు చెందిన రవి, అన్నపూర్ణ అనే భార్యభర్తలు తమ పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. వెంకటేష్ తన పిల్లలతో పాటు, రవి పిల్లలతో అప్పుడప్పుడూ ఆడుతుండే వాడు.రవి కూతురు దీపిక (8)ను వెంకటేష్ తను ఉంటున్న రెండవ అంతస్తుపై ఆడిస్తుంగా ప్రమాదవ శాత్తు ఇద్దరు జారి పడడంతో పెద్ద శబ్దం రావడంతో చుట్టు ప్రక్కల వారు వచ్చి తీవ్రగాయాలపాలైనా వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాధాచాయలు అలుముకున్నాయి.