Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిటీబ్యూరో
రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం)ను భద్రపరిచేందుకు బేగం బజార్లోని ఈవీఎం గోడౌన్లో ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ మంగళవారం పరిశీలించారు. శాసన సభకు జరిగిన ఎన్నికల ఈవీఎంలు ప్రస్తుతం బేగంబజార్ గోడౌన్లో ఉన్నాయి. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు అద్వైత్కుమార్ సింగ్, సందీప్జాల సమక్షంలో ఈ గోడౌన్ల తాళాలు తెరిచారు. ప్రస్తుతం ఈ గోడౌన్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు జూబ్లీహిల్స్, గోషామహల్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలపై కోర్టు కేసులు ఉన్నందున ఈ ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్లను ఎట్టిపరిస్థితిలోనూ తెరవవద్దని కమిషనర్ అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్ జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన లోక్సభ ఎన్నికల ఈవీఎంలను బేగంబజార్ గోడౌన్లోనే భద్రపర్చడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు దానకిషోర్ తెలిపారు. ఇందుకుగాను అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా వేర్వేరుగా ఈవీఎంలను భద్రపరిచేందుకు ప్రత్యేక గదులను కూడా కేటాయించినట్టు తెలిపారు. బేగంబజార్ గోడౌన్ను సీసీ కెమెరాల నిఘాలో ఉంచినట్టు కమిషనర్ తెలిపారు.