Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
నవతెలంగాణ - అబ్దుల్లాపూర్మెట్
తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్ మండలం, బండరావిరాలలో డైనో వరల్డ్ పార్క్ను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ.. మనిషికి సంతోషాన్ని పంచే పార్కులు ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి పార్కులు మరిన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రభుత్వం తరుఫున మరింత సహకారం అందిస్తానని తెలిపారు. టూరిజం ప్రాంతాలు అభివృద్ధి చెందేకొద్ది అక్కడి ప్రాంతాలకు మంచి గుర్తింపు వస్తుందని చెప్పారు. దీంతో అక్కడి ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టుల ఎయిర్పోర్టు నుంచి నేరుగా పర్యాటక ప్రదేశానికి వెళ్లే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తున్నందని చెప్పారు. టూరిస్టు ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. అభివృద్ధి చెందే టూరిస్టు ప్రాంతాలను టూరిజం సైట్లో పెడు తామన్నారు. మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ పార్క్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, రంగారెడ్డి జిల్లా రైతు సమన్వయ కమిటి అధ్యక్షులు లక్ష్మారెడ్డి, హయత్నగర్ ఎంపీపీ మంజుల, బండ రావిరాల సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు కృష్ణ, చక్రవర్తి, జగదీశ్వర్, రంగారెడ్డి, శ్రీనివాస్, డైనో నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.