Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్రెడ్డి
నవతెలంగాణ - సిటీబ్యూరో
టీఆర్టీ అభ్యర్థుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, పాఠశాలలు పున: ప్రారంభం అయ్యే లోపు టీఆర్టీ నియామకాలు అయ్యే విధంగా చూడాలని కోరుతామని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. బుధవారం నారాయణగూడలోని పీఆర్టీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆయన టీఆర్టీ ఎంపికైన అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్నారు అనే వాదన సరికాదని అన్నారు. ఉపాధ్యాయులే ఎక్కువ ఉంటే 22 వేల మంది విద్యా వాలంటీర్లు అవసరమని అధికారులు ఎలా ప్రతిపాదించారని ప్రశ్నించారు. టీఆర్టీకి ఎంపికైన అభ్యర్థులు ఉండగా విద్యా వాలంటీర్లు తీసుకుంటామనడం సబబు కాదు అని చెప్పారు. టీఆర్టీ నియమకాలు అయిన తరువాత మిగిలిన ఖాళీల్లో విద్యా వాలంటీర్లను తీసుకోవాలని విద్యాశాఖ మంత్రిని కోరుతామని తెలిపారు.