Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
ఇంటర్ ఫలితాల్లో దిల్సుఖ్నగర్ సాకేత జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా విడుదలైన ఫలితాల్లో ఎప్పటిలాగే విద్యార్థులు హెచ్ఈసీ, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, విభాగాల్లో ప్రతిభను చాటి ప్రథమశ్రేణిలో నిలిచారు. సాకేత కళాశాల ప్రిన్సిపాల్ జే.శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందించటం వల్లనే సాకేత విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. హెచ్ఈసీ విభాగం 1000 మార్కులకు కే.గిరినాయక్ (945), కే.మాతృనాయక్ (908), ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు సయ్యద్ అరీఫ్ (437), ఇర్ఫాన్ (401), నిఖిత (400), జీ.మైన సీఈసీ మొదటి ఏడాదిలో 500 మార్కులకు 417, టీ.శివప్రసాద్ సీఈసీలో 413, ఎం.మనీషా 401 మార్కులు సాధించి కళాశాల టాపర్లుగా నిలిచారని తెలిపారు. అద్యాపకబృందం ఎనలేని కృషితో విద్యార్థుల ప్రతిభకు తోడు కావడంతో ఈ ఫలితాలు వచ్చాయన్నారు. ప్రతి ష్టమైన ప్రణాళిక, బోధన, విద్యార్థుల ప్రతిభను గుర్తించ టం సాకేత కళాశాల సొంతం అన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెచ్వోడీ పీ.రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.