Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
లింగోజిగూడ డివిజన్లోని జానకీ ఎన్క్లేవ్ కాలనీని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు అధికారులకు సూచి ంచారు. బుధవారం జానకీఎన్క్లేవ్ ప్రధాన రహదారిలో నూతనంగా జరుగుతున్న సెంట్రల్ డివైడర్, పుట్పాత్ పనులను అధికారులు, కాలనీ ప్రతినిధులతో కలిసి ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాఫ్ హైదరాబాద్-షాన్దార్ హైదరా బాద్ కార్యక్రమంలో భాగంగా జానకీ ఎన్క్లేవ్ కాలనీని పరిశుభ్రమైన కాలనీగా, కాలనీ పరిసరాలు పరిశుభ్రంగా అందంగా తీర్చిదిద్దాలని కాలనీ ప్రధానరహ దారిలో సెంట్రల్ డివైడర్, పుట్పాత్ పనులు చేపడుతు న్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు రుక్మారెడ్డి, సుభాష్, చంద్రారెడ్డి, రవీందర్నాథ్, రఘు మోహన్రెడ్డి, సతీష్, రంగనాథ్, అనంతరెడ్డి, వార్డు సభ్యుడు మల్కాజిగిరికుమార్, ఏరియా కమిటీసభ్యులు నాగేశ్వరరావు, ఇంద్రాజీ తదితరులు పాల్గొన్నారు.