Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయంజాల్
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్లోని సర్వే నెంబర్ 248లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను మున్సిపల్ కమిషనర్ సురేందర్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం సిబ్బంది కూల్చివేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. సర్వే నెంబర్ 248లో 5 ఎకరాల్లో ఏర్పాటు చేసిన వెంచర్లో నిర్మిస్తున్న అనుమతిలేని నిర్మాణాలను దాదాపు 5 ఇండ్లను పాక్షికంగా కూల్చివేసినట్టు తెలిపారు. ప్రభుత్వ నియమనిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ప్రజలు ప్లాట్లు, ఇండ్లు కొనుగోలు చేసేటప్పుడు సక్రమమా, అక్రమమా అని అన్ని డాక్యుమెంట్లు చూసుకొని కొనుగోలు చేయాలని తెలిపారు. అనుమతిలేని నిర్మాణాలు చేపడుతున్న ట్టు ఎవ్వరి దృష్టికైనా వస్తే అధికారులకు సమాచారం అందజేస్తే ఆ నిర్మాణదారులపై చర్యలు తీసుకుంటా మన్నారు. ఇలాంటి నిర్మాణాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడడంతో పాటు అభివృద్ధి ఆగిపోతుందని తెలిపారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి కొనుగోలు చేసే సమ యంలో ఒకటికి రెండు సార్లు చూసుకొని కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిల్ కలెక్టర్లు ప్రవీణ్, శ్రీనివాస్, ప్రశాంత్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.