Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాచారం ప్రజలకిచ్చిన హామీని విస్మరించిన కార్పొరేటర్
- పార్టీ మారినా అభివృద్ధి శూన్యం
నవతెలంగాణ-నాచారం
రాజనీతి లేని నాయకులను ప్రజలు విశ్వసించినంత కాలం ప్రజలు మోసపోతునే ఉంటారని కారల్ మార్క్స్ ఏనాడో చెప్పాడు. కానీ నేడు ప్రజలను మోసం చేయటంలో రాజకీయ నాయకుల కన్నా మేధావి లేడని చెప్పక తప్పదు. సేవకుడుగా పని చేస్తానంటే నాచారం డివిజన్ ప్రజలు నమ్మి గెలిపిస్తే స్వలాభం కోసం నేడు కేసీఆర్ బాటలో నడుస్తున్నాడు కార్పొరేటర్ శాంతిసాయిజెన్శేఖర్. దోమలపై యుద్ధం శాంతి సాయిజెన్శేఖర్ సిద్ధం అంటూ నాలుగు రోజులు హంగామా చేసి 'నిరసన దీక'్ష చేసిన కార్పొరేటర్ ఎక్కడ అంటూ నేడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నాచారం డివిజన్లో ఓపెన్నాలాలతో పాటు ప్రధానంగా రెండు చెరువులున్నాయి. ఎర్రకుంట పటేల్ చెరువు, హెచ్యంటీ పెద్ద చెరువు. వాటిలో గుర్రపు డెక్క ఆకు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలు తిష్టవేసి దోమలకు నిల యాలుగా మారాయి. సాయంత్రం అయిందంటే చాలు అరుబయట అరనిమిషం కూడా ఉండకు ండా చేస్తున్నాయి. దోమలపై యుద్ధం శాంతి సాయిజెన్శేఖర్ సిద్ధం అంటూ గల్లీ గల్లీ తిరిగి ఇప్పుడు మర్చిపోయావా.? అంటూ నాచారం ప్రజలు కార్పొరేటర్ ను ప్రశ్నిస్తున్నారు.
ప్రజల నమ్మకం తాకట్టు.....
నాయకులు స్వార్థం కోసం పదవులు, పార్టీలు మారి అధికారంలో కొనసాగుతూనే ఉం టారు. కానీ ప్రజల జీవితాల్లో మార్పులు మాత్రం కనిపించవు. నాచారం డివిజన్లో కూడా జరు గుతున్నది అదే. అభివృద్ధే ద్యేయంగా... దోమలు లేని నాచారంగా తీరిదిద్దడమే లక్ష్యంగా చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కార్పొరేటర్ నేడు అధికార పార్టీ భజన చేస్తూ ప్రజా సమస్యలు గాలికి వదిలిపెట్టాడు.
పార్టీ మారినా అభివృద్ది శూన్యం..
డివిజన్ అభివృద్ది కోసమే పార్టీ మారుతు న్నా అంటూ టీిఆర్ఎస్లో చేరినా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే అని చెప్పాలి. సొంత పనులు చక్కబెెట్టుకోవటానికే సమయం సరిపోతుందని ప్రజా సమస్యలు పట్టించుకునే తీరిక లేకపోవటంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. తనపై పోటీ చేసి ఓడిపోయిన టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి మేడల జ్యోతి మల్లికార్జున్గౌడ్ ప్రస్తుతం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డికి అత్యంత సన్నిహితురాలిగా పేరుంది. దీంతో కార్పొరే టర్కు ఎటువంటి పవర్స్ లేకుండా పోయాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కార్పొరేటర్ శాంతిసాయిజెన్శేఖర్ పరిస్థితి టీఆర్ఎస్ పార్టీలో కక్కలేక మింగలేక అన్నట్టుగా తయారైంది. దీంతో ఎమ్మెల్యేని ఎదిరించలేక.. డివిజన్ అధ్యక్షుడితో ఐక్యతలేక నాచారం ప్రజలను నట్టేట ముంచి కార్పొరేటర్ కాలమెల్లదీస్తున్నాడని ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రయోజనం కోసమే పార్టీ మారిండు..
ప్రజా సమస్యలను పక్కన పెట్టి తన సొంత ప్రయోజనం కోసం పార్టీ మారిన నాయకుడిని ప్రజలు నమ్మర ని, మారినా ప్రజలకు చేసిందేమీ లేదు. కనీసం కాంగ్రెస్లో ఉన్నంత కాలం ప్రజల సమస్యలపై ప్రశ్నించే స్వేచ్ఛైనా ఉంది. ప్రస్తుతం టీఆర్ఎస ్లో కనీసం ప్రజలు గుర్తించని దుస్థితిలో ఉన్నారు.
- బూలేట్ శ్రీనివాస్యాదవ్, కాంగ్రెస్నాయకుడు
కొత్త కోణంలో
నాచారం డివిజన్లో రాజకీయ పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుడా రాబోయే రోజుల్లో మా ర్పుకోసం పని చేసే యువతను, రాజకీయ అవకాశం ఇస్తే మార్పు చేందుతుందనే నమ్మ కం ప్రజల్లో ఉంది. స్వార్థపూ రితమైన రాజకీయ నాయకు లను ఇక ప్రజలు నమ్మరు.
-గద్ద క్రాంతికిషోర్, ఎంటెక్ విద్యార్థి
దోమ కాటుతో రోగాలబారిన పడుతున్నాం
ఎర్రకుంట పటేల్ చెరువు పక్క నే ఉన్న బస్తీ ఎరుకల బస్తీ దోమల తో సహజీవనం చేస్తున్నాము కాలా లతో నిమిత్తం లేకుండా రోగాలభారి న పడుతున్నాం. ఇక వర్షాకాలం వస్తే మా సమస్యలు వర్ణనాతీతంగా ఉంటాయి. కనీసం దోమల నివారణకు చర్యలు తీసుకునే నాథుడు లేకపోవటంతో ఇంట్లో ఉక్కపోత బయట దోమల మోతతో ఇబ్బందులు పడుతున్నాం.
-శ్రీరాం కళ్యాణి, వార్డు కమిటీ సభ్యురాలు