Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ధూల్పేట్
లోక్సభకు పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం బయట పడే సమయం వచ్చింది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాగవేసేది ఎవరనే అలోచనలు ఆయా ప్రధాన పార్టీల నాయకులు, పార్టీ శ్రేణుల్లో మొదలయ్యాయి. ఈ నియోజకవర్గం మజ్లీస్కు కంచుకోటగా ఉంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందనే మాటలు ఎన్నికల సమయంలో బలంగా వినపడ్డాయి.
మళ్లీ అసదుద్దీనే..!
హైదరాబాద్ పార్లమెంట్ సీటును కైవసం చేసుకోవడం ఇతర పార్టీలకు అంతా ఆషామాషీకాదు అనే సందేహం పాత నగర వాసుల్లో నెలకొన్న అభిప్రాయం. ఇది అందరికి తెలిసిందే. నాడు మజ్లీస్ పార్టీ అధినేత దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఈ నియోజకవర్గానికి రారాజుగా వ్యవహారించారు. ఆయన మరణాంతరం ఈ నియోజకవర్గాన్ని ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ పగ్గాలతోపాటు హైదరాబాద్ పార్లమెంట్ సీటును మజ్లీస్ పార్టీకి కంచుకోటగా తయారు చేశారు. ముచ్చటగా మూడు సార్లు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా వ్యవహారించారు. ఇక నాలుగోసారి కూడా తన విజయానికి తిరుగులేదని బల్లగుద్ది చెబుతున్నారు. డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నిలల్లో మజ్లీస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కిందకు వచ్చే కార్వాన్, గోషామహల్, మలక్పేట్, చార్మినార్, చాంద్రాయణ్గుట్ట, బహదూర్పురా, యాకుత్పురా నియోజకవర్గాల్లో ఒక్క గోషామహల్ నియోజకవర్గం మినహ అన్ని నియోజకవర్గాల నుంచి మజ్లీస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గెలుపొందిన విషయం విదితమే. ఇదిలా ఉండగా ఎన్నికల కోడ్ రాకముందునుంచే మజ్లీస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల మధ్యే ఉంటూ స్థానిక సమస్యలమీద ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి, సమస్యలను పరిష్కరించి, స్థానిక ప్రజల ఆదరణను చూరగొన్నారని కొందరు చెబుతున్నారు. మజ్లీస్ పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలామ్లో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిత్యం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారని ఆ పార్టీ అభిమానులు చెబుతున్నారు. నాలుగోసారి కూడా హైదరాబాద్ పార్లమెంట్ సీటు తమదేనంటూ అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ నాయకులు తమ ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
మజ్లీస్, బీజేపీలకు గట్టీ పోటీ కాంగ్రెస్..!
గతంలో కాంగ్రెస్, మజ్లీస్ మిత్రపక్షంగా ఉండటంతో, ప్రతిసారి జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన క్యాడర్ గల నేతలను ఎన్నికల బరిలో నిలబెట్టకుండ డమ్మీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించి, ఎన్నికల బరిలో దింపిది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత మజ్లీస్కు దూరంగా కాంగ్రెస్ ఉన్న విషయం తెలిసిందే. తన గెలుపు ఖాయమని ఫిరోజ్ఖాన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనను గెలిపిస్తే పాతనగరాన్ని గోల్డెన్ సిటీగా మార్చివేస్తానని, పాతనగరంలో పేదరికాన్ని, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని ప్రచారంలో చెప్పారు. ఈ ఎన్నికల్లో మజ్లీస్కు గట్టీ పోటీ కాంగ్రెస్ ఇచ్చిందని ప్రభావితం చేస్తుందని కాంగ్రెస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
సంక్షేమ పథకాలతో గెలుపు..
టీఆర్ఎస్ తరపున హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పాత నగరానికి చెందిన పుస్తే శ్రీకాంత్ ఎన్నికలబరిలో నిలిచారు. వాస్త వానికి హైదరాబాద్ పార్లమెంట్ నియో జకవర్గం మజ్లీస్ పార్టీకి కంచుకోటగా నిలవడమేగాక, టీఆర్ఎస్కు ప్రస్తుత ం మిత్రపక్షంగా వ్యవహారిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నియోజక వర్గం నుంచి టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ ప్రత్యేకంగా పుస్తే శ్రీకాం త్కు టికెట్ను కేటాయించిందే తప్ప, ఈ నియోజకవర్గంపై పార్టీ ముఖ్య అధినేతలు గాని, రాష్ట్ర మంత్రులు గాని ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదనే విమ ర్శలు పాత నగర వాసులనుంచి విని పిస్తున్నాయి.
హైదరాబాద్పై బీజేపీకి గంపెడు ఆశలు..
గత ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్రావు మొట్టమొదటిసారిగా ఎన్నికలబరిలో నిలిచి, మజ్లీస్ పార్టీకి గట్టీ పోటీ ఇచ్చారు. రెరడోసారికూడ బీజీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఈ సారి హైదరాబాద్ సీటును కైవసం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఆయనకు కొన్ని కుల సంఘాలు, ధార్మిక సంఘాలు నిత్యం కలిసి మద్దతు తెలిపాయి. గతంలో మజ్లీస్ పార్టీని ఓడించేందుకు అప్పటి కార్వాన్ మాజీ ఎమ్మెల్యే దివంగత నేత బద్దం బాల్రెడ్డి ప్రయత్నించారు. కొన్ని వేల ఓట్ల తేడాలో ఓటమి పాలైన విషయం స్థానికులకు తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ గతంలో నాంపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయిన మహ్మద్ ఫిరోజ్ఖాన్ను రంగంలోకి దింపడంతో, ఈ సారి ముస్లిము మైనార్టీ ఓట్లు చీలిపోయి, బీజేపీ అభ్యర్థికి లాభం కలిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.