Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్
నవతెలంగాణ-రాంనగర్
ఎన్నికల్లో ఏ అగ్రకుల పార్టీ గెలిచిన దళితులకు ఒరిగేదేమీ లేదని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ అన్నారు.బుధవారం బాగ్లింగం పల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేదావ్రూత్, ప్రధాన కార్యదర్శి చేపూర్ రాజులతో కలిసి మాట్లాడుతూ.. నేడు జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపు నామమాత్రమేనని అన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈవీఎంల హ్యాకింగ్ ద్వారా ఎన్డీఏ బీజేపీ కూటమి విజయం ఖాయమని జోస్యం చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిపోయిందని దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ వంతపాడిందని ఆరోపించారు. ఓట్ల లెక్కింపు ఒక తంతు మాత్రమేనని, రెండు తెలుగు రాష్ట్రాలలో ఈవీఎంల తంతు జరిగిందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపీతో కలిసి బీజేపీ, ఎన్డీఏ భారీ ద్రోహానికి పాల్పండిందన్నారు. మొత్తం నియోజకవర్గాలలోని వీవీప్యాట్ స్లిప్పులు లెక్కిస్తే వాస్తవ ఫలితాలు ప్రజలకు తెలుస్తాయన్నారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమి, బీజేపీ నాయకత్వంలోని యూపీఏ కూటమి రెండు కూడా మనువాద పార్టీలేన్నారు. స్వతంత్రమైన రాజ్యాధికార సాధన ద్వారానే దళిత బహుజనులకు విముక్తి లభిస్తుందన్నారు. కాబట్టి ఎన్నికల ఫలితాల వల్ల ఆధిపత్య పెట్టుబడిదారీ వర్గాలకు ఫలితం కలుగుతుంది తప్ప దళిత బహుజనులకు ఒరిగేదేమీ లేదన్నారు.