Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోశాల ఫెడరేషన్ అధ్యక్షుడు మహేష్ ఆగర్వాల్
నవతెలంగాణ-అంబర్పేట
రాష్ట్రంలోని ప్రతి గోశాలను సంరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని తెలంగాణ గోశాల ఫెడరేషన్ అధ్యక్షుడు మహేష్ ఆగర్వాల్ కోరారు .బుధవారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో నీటి కొరత, గడ్డి లేక పశువులు అల్లాడుతున్నాయని, పశువుల మేత కోసం ప్రతి జిల్లాలో తాత్కాలికంగా 100 ఎకరాల అటవీ భూమిని కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో గోవులను ఏర్పాటు చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ ఆలయాల నిర్వహకులు పాటించడం లేదని, గోవులను పెంచేందుకు గడ్డిలేక రైతులు మార్కెట్లో గోవులను విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోవుల ఉత్పత్తులను మరింత పెంచేందుకు సబ్సిడీ రూపంలో ఆవులను పంపిణీ చేయాలని, గోశాలకు కావాల్సిన అన్ని వసతులను కల్పించి, గోవులకు సంపూర్ణ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న అటవీ భూములు లక్షల ఎకరాలు కబ్జాకు గురవుతున్నాయని, గోశాలలకు కేటాయిస్తే మహారాణ్యం సాధిస్తామని, రాష్ట్రంలో 216 రిజిస్టర్ గోశాలలు ఉన్నాయని ఇందుల్లో 36 వేల పశువులను పెంచుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పంచకులం గో ఫెడరేషన్ ప్రతినిది అచార్య శ్రీకమలేష్ మహరాజ్, ఇబ్లిబన్ గోశాల ప్రతినిధి అజరురాజ్ శర్మ, శ్రీకామధేను గోవర్ధనగిరి సన్దాన్ కేంద్రం ప్రతినిధి ఎల్.మురళిధర్రావు, శ్రీసురభి కాంపెయిన్ సలహదారు మాధవ్ దాసాలు పాల్గొన్నారు.