Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ తెలంగాణ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్
నవతెలంగాణ-ఓయూ
తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై అసత్య ఆరోపణలు చేయడం తగదని బుధవారం ఎమ్మార్పీఎస్ తెలంగాణ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్య క్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అణగారిన వర్గాలకు విద్యనందించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నిరంతరం పని చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై కర్నే శ్రీశైలం ఒక దొంగ సంస్థను పెట్టుకొని జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ కమిటీ పేరు మీద తన పబ్బం గడుపుకుంటున్నాడని విమర్శించారు. మనువాదుల చేతిలో కీలుబొమ్మగా మారి వారు ఏదీ చెబితే ఈయన అది ఆచరిస్తు న్నాడని అన్నారు. తమ కుట్రలో భాగంగానే కర్నె శ్రీశైలం చేత తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని, దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. శ్రీశైలం వెనుక ఎంతటి వారు ఉన్న వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చ రించారు. ఆరోపణలు చేసిన వ్యక్తి బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. గురుకుల విద్యా సంస్థల్లో పిల్లలు ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా చదువుతున్నారంటే దానికి కారణం ప్రవీణ్ కుమార్ కషి అని అన్నారు. ఈ కార్య క్రమంలో టిఎస్ ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను కనకరాజు, ఎమ్మెస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొల్లూరి వెంకట్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొంగరి శంకర్, చెల్లూరి విజరు, హుస్సేన్, గోవర్ధన్, చందు, అశోక్, కుమార్ నాగరాజు, శ్రీకాంత్లు పాల్గొన్నారు.
బేగంపేట్ : తెలంగాణ గురుకుల విద్యాల యాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై సంఘ విద్రోహ శక్తులు ఆరోపణలు చేయడం సరికాదని అల్ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు గద్దపాటి విజయరాజు ఖండించారు.