Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అమీర్పేట
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీబాల్రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం పడిన భారీ వర్షానికి ఇండిస్టీయల్ ఎస్టేట్లో పోస్టు ఆఫీస్ నుంచి స్టీల్ ఫ్యాక్టరీ వెళ్లే దారిలో పలు చెట్లు వర్షానికి పడిపోవడంతో కార్పొరేటర్ బుధవారం జీహెచ్ఎంసీ, హర్టీకల్చర్ డిపార్ట్మెంట్ సహకారంతో తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డివిజన్లోని పలు ప్రాంతాల్లో పడిన చెట్లను తొలగించే విధంగా చర్యలు తీసుకొవాలని అధికారులకు కార్పొరేటర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ గోవర్థన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కొలను బాల్రెడ్డి, డివిజన్ ప్రసిడెంట్ ఖలీల్బేగ్, సురేష్గౌడ్, మెటాలిక్ ఇండస్టీ ఎండి రాజు తదితరులు పాల్గొన్నారు.