Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శామీర్పేట
రాష్ట్రంలోని విత్తన కంపెనీలు, విత్తన దుకాణాలు నకిలీ విత్తనాలను తయారుచేసినా, అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ ఏడీఏ పద్మ అన్నారు. బుధవారం రాష్ట్ర స్థాయి టాస్క్ఫోర్స్ బృందం శామీర్పేట మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ ఏడీఏ పద్మ, విత్తనాభివృద్ధి సంస్థ రిజీనల్ మేనేజర్ పాపిరెడ్డి, పోలీస్ శాఖ టాస్క్ఫోర్స్ అధికారి అంతిరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేవరాంజల్ పరిధిలోని గోడౌన్ లలో గల పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయాల విత ్తనాల్లో ఎవైనా నకిలీ విత్తనాలు ఉన్నాయో తెలసు కోవడానికి తనిఖీలు చేశారు. కల్తీ పత్తి విత్తనాలు, హెచ్టీ పత్తి విత్తనాలు అమ్మకుండా ప్రభుత్వం పకడ్భందీ చర్యలు చేపడుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా టాస్క్ఫోర్సు బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. ఎవరైనా కల్తీ విత్తనాలు విక్రయిస్తే పీడీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే డీలర్ దుకాణాల్లో కూడా రిజిష్టర్లు, లైసెన్సులు విత్తనాలకు సంబంధించిన పత్రాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏఓ రమేష్ పాల్గొన్నారు.