Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్స్పెక్టర్ రోహిత్
నవతెలంగాణ - సికింద్రాబాద్
ప్రభుత్వం సాధారణ, పేద ప్రజలకు అందజేసే రేషన్ బియ్యాన్ని వ్యాపారులు, ఇతరులు ఎవరైనా కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ రోహిత్ అన్నారు. బుధవారం అడ్డగుట్ట డివిజన్లోని ఆదర్శ చంద్రశేఖర్ నగర్లో స్థానికుల ఫిర్యాదు మేరకు 8.24 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని సికింద్రాబాద్ సర్కిల్-9 రేషన్ అధికారులు పట్టుకు న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంతమంది వ్యక్తులు బస్తీల్లో రేషన్ బియ్యాన్ని కొంటుండగా వ్యక్తుల దగ్గర నుంచి బియ్యం బస్తాలను పట్టుకొని రేషన్ అధికారులకు అప్పజెప్పామన్నారు. ఎవరైనా బ్లాక్లో రేషన్ బియ్యం అమ్మినట్టయితే వారి గురించిన సమాచారాన్ని వెంటనే ఇవ్వాలని ప్రజలను కోరారు.