Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని జోనల్, సర్కిల్ కార్యాలయాలు డిస్పోసబుల్ వాటర్ బాటిళ్ల వినియోగాన్ని నిషేదిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ నిర్ణయించారు. దీంతో జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరిగే అన్ని సమావేశాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల స్థానంలో గాజు, స్టీల్ గ్లాసుల ద్వారా అధికారులకు మంచినీరు అందించే ప్రక్రియను చేపట్టారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశాల సందర్భంగా పెద్ద ఎత్తున ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగించడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో పాటు నీరు కూడా వృథా అవుతోంది. దీనికితోడు వాటర్ బాటిళ్ల ఖర్చు కూడా అధికంగానే ఉండేది. తాజాగా కమిషనర్ దానకిషోర్ నిర్ణయంతో జీహెచ్ఎంసీలో జరిగే అన్ని సమావేశాల్లో అధికారులందరూ వాటర్ బాటిళ్ల స్థానంలో గాజు, స్టీల్ గ్లాసుల్లో మంచినీరు అందించే విధానాన్ని ప్రవేశపెట్టారు.