Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగణ-మేడ్చల్రూరల్
మేడ్చల్ మండలంలోని పూడూర్ గ్రామానికి చెందిన యువకుడు తోకల శివయాదవ్(23)ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవంగా గాయపడి యశోద ఆసత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పూడూర్ గ్రామపరిధిలోని మండల మాజీ ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి, సర్పంచ్బాబు, ఎంపీటీసీ నీరుడి రఘు, మాజీ ఉపసర్పంచ్ గోపాల్రెడ్డి, వార్డు సభ్యులు మనేపల్లి వేంకటేష్, శ్రీకాంత్, దుద్దిగళ్ళ లింగమ్మ శంకర్, కవిత దేవేందర్, కృష్ణ, గ్రామస్తులు యాదయ్య, రాములు, కోలవేంకటేష్లు మృతుని కుటుంబానికి ఆదుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ను కోరారు. స్పందించిన ఆయన సీఎం సహయనిధి నుంచి బాధితుడి కుటుంబానికి ఆర్థికసాయం ఇస్తామని తెలిపారు.