Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృద్ధురాలిని నమ్మించి రూ.50లక్షలు టోకరా
- ముగ్గురి అరెస్టు
నవతెలంగాణ-సిటీబ్యూరో
తాము తీయ్యబోయే సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని ఓ వృద్ధురాలిని నమ్మించి లక్షల్లో డబ్బులు దండుకున్న 16 మంది ముఠాలోని ముగ్గురిని టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 19.270 గ్రాముల బంగారు ఆభరణాలు, 111.550గ్రాముల వెండి ఆభరణాలతోపాటు కారు, రూ.65వేల నగదు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గురువారం డీసీపీ రాధాకిషన్రావు తెలిపిన వివరాల మేరకు కొండాపూర్కు చెందిన వి.నరేష్కుమార్ అలియాజ్ ఆధిత్యా, విజపురికాలనీకి చెందిన ఎం.రామకృష్ణ, సరూర్నగర్కు చెందిన కె.సోమన్నతోపాటు మరో 13 మంది ఒక ముఠాగా ఏర్పాడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించాలని జస్ట్డయాల్, ఆన్లైన్లో వివిధ ఫోన్నెంబర్లును సేకరించి ఫోన్లు చేస్తున్నారు. సినిమాలపై మక్కువ ఉన్నవారిని ఎంపిక చేసుకుంటున్నారు. ప్రముఖలు దర్శకత్వంలో సినిమాలు నిర్మించామని పలువురిని నమ్మిస్తున్న ఈ ముఠా బాధితుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. బాధితులు ప్రశ్నించిన సమయంలో ఫోన్లను స్విచ్ఛాఫ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జస్ట్ డయాల్లో ఫోన్ నెంబర్ను సేకరించిన ఈ ముఠా ఓ మహిళా న్యాయవాదికి ఫోన్ చేశారు. తాము సినిమా నిర్మాతలుగా పరిచయం చేసుకున్నారు. రాజమౌలీతో పాటు ప్రముఖ దర్శకులతో కలిసి సినిమాలు చిత్రీకరించామని చెప్పారు. తాము 'ఆర్ఆర్ఆర్' అనే నూతనంగా సినిమాను చిత్రీకరిస్తున్నామని నమ్మించారు. మీకు సినిమాల్లో నటించాలనే ఆశ ఉంటే అందులో మీకు అమ్మ పాత్రను ఇస్తామని చెప్పారు. బాధితురాలిని నమ్మించేందుకు ఫిల్మి చాంబర్ ఐడీకార్డులతోపాటు మా ఐడీ కార్డు, వివిధ టీవీ సిరియల్స్ ఐడీకార్డులను ఆన్లైన్లో పంపించారు. నిర్మాత ఆధిత్య అని చెప్పడంతో బాధితురాలు వారిని పూర్తిగా నమ్మింది. వారు చెప్పిన విధంగా వివిధ బ్యాంక్ అకౌంట్లలో రూ.40 నుంచి 50లక్షల వరకు ట్రాన్స్వర్ చేసింది. ఆధిత్యా అతని స్నేహితులు సినిమా చిత్రీకరణకు సైట్స్లను చూడాలని చెప్పడంతో సిఫ్ట్ కారును పంపించింది. అనుమానం వచ్చిన బాధితు రాలు ఆరా తీయ్యగా వారు మోసం చేసినట్టు తెలిసింది. దాంతో తాను ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అసభ్యకరంగా మాట్లాడారు. ఆ తర్వాత ఎవరి ఫోన్లు పనిచేయక పోవడంతో బాధితురాలు బోయిన్పల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈక్రమంలో విచారణ చేపట్టిన టాస్క్ఫోర్సు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తామని ఎవరైనా చెప్పితే నమ్మి మోసపోవద్దని డీసీపీ సూచించారు. ఏదైనా అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.