Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం బోధిస్తూ పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వై. నర్సింహా రెడ్డి పదవీ విరమణ అభినందన సభలో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వై. నర్సింహా రెడ్డి ఉపాధ్యాయ వృత్తికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకటయ్య, ప్రధానోపాధ్యాయులు శంకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.