Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీ సముదాయంలో గల సాయిబాబా దేవాలయం, శివాలయంల పేరుతో అక్రమ వసూళ్లకు బుద్ద రమణబాబు అనే వ్యక్తి పాల్పడుచున్నాడని ఈ నెల 13న రాజీవ్ గృహకల్ప కాలనీ నాయకులు బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సదరు బాచుపల్లి సీఐ జగదీశ్వర్ ఇప్పటి వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఈ కేసును నీరుగారుస్తున్నారని, రాజీవ్ గృహకల్ప వాసులు తోట భిక్షపతి, ముత్యాలు, ప్రభాకర్రెడ్డి, కుమార్రెడ్డిలు ఆరోపించారు. గతంలో మధర్థెరిసా ఫౌండేషన్ సంస్ధను తెరపైకి తెచ్చి ఈ స్వచ్చంద సంస్థ ముసుగులో పలువురు వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడని, ఇప్పటికైనా సీఐ రమణబాబుపై విచారణ చేపట్టి చర్యలు చేపట్టి దేవాలయాల ముసుగులో ఆయన చేస్తున్న అక్రమ వసూళ్లు, వాటిని ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్న ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రాజీవ్ గృహకల్ప వాసులు కోరుతున్నారు.