Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు కేపీ విశాల్ గౌడ్
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోతు న్నందున నీటి వృథాను అరికట్టి జల సంరక్షణకు అందరూ సహకరించాలని టీఆర్ఎస్ యూత్ నాయకులు కేపీ. విశాల్ గౌడ్ తెలిపారు. జీడిమెట్ల డివిజన్ కుత్బుల్లాపూర్ గ్రామంలో సీనియర్ సిటిజన్ భవనంలో అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛసర్వేక్షన్ -2020, జలవనరుల పరిరక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న తాగునీటిని వృథా చేయవద్దని సూచించారు. జల మండలి ద్వారా ఇండ్లకు అందిస్తున్న గోదావరి జలాలను అవసరమైన మేర ఉపయోగించుకొని పొదుపుగా వాడుకోవాలన్నారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటి పోయినందున ఈ ఏడాది భారీ వర్షాలు కురవకపోవడంతో నీటి లభ్యత ఇబ్బందికరంగా మారిందన్నారు. అనంతరం సమావేశానికి హాజరైన గృహిణిలచే నీటి వృథాను అరికడతాం-జలసంరక్షణ చేపడతాం అంటూ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ జలమండలి మేనేజర్ శ్రీనివాస్, ప్రాజెక్ట్ అధికారి సంధ్య సీఓ మహిపాల్రెడ్డి, మహిళా నాయకురాళ్ల్లు ఇందిరారెడ్డి, అరుణారెడ్డి, సీఆర్పీలు, సంఘ సభ్యులు , సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.