Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు పేదలకు వరం లాంటిదని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం బడంగ్పేట మున్సిపాలిటీ పరిధిలోని బాలాపూర్ మండల తహాసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక సంక్షమ పథకాలను ప్రవేశపెట్టిందని వాటిని పేదలందరూ సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. బాలాపూర్ మండల తహాసీల్దార్ చంద్రశేఖర్గౌడ్, బడంగ్పేట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ యాతం శ్రీశైలంయాదవ్, సరూర్నగర్ మాజీ ఎంపీపీలు తీగల విక్రమ్రెడ్డి, సిద్దాల లావణ్య, మాజీ కౌన్సిలర్లు దండు గణేష్ముదిరాజ్, అంబోతు ధశరథనాయక్, టీఆర్ఎస్ నాయకులు నరేంధర్గౌడ్, చిగురింత పెద్ద నర్సింహ్మరెడ్డి, పి. సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.