Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
మన్సురాబాద్ డివిజన్లో చాలా మంది కాలనీ వాసులు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవడటం గర్వకారణమని మన్సురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలతోనే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. గురువారం మన్సురాబాద్ డివిజన్ ఆగమయ్య నగర్ కాలనీ వాసులు టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును కార్పొరేటర్ చేతుల మీదుగా స్వీకరించారు. వారి వెంట కాలనీ వాసులు దేవేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.