Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు ఈ నెల 21వరకూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ధరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని దోస్త్ కన్వీనర్ లింబాద్రి ప్రకనటలో తెలిపారు. ఈ నెల 22వరకూ వెబ్ ఆప్షన్లు చేసుకునేందకు గడువుందని 26న ప్రత్యేక సీట్లు కెటాయిస్తామని, 26నుంచి 29వరకు కళాశాలల్లో చేరేందుకు అవకాశం ఉందన్నారు. గతంలో రిజిస్ట్రేషన్లు చేసి వెబ్ ఆప్షన్లు ఇవ్వని వారు, గతంలో సీటు దక్కని వారు కూడా ఈ విడతలో మరోసారి ప్రయత్నం చేయవచ్చన్నారు. సీటు వచ్చిన కళాశాలల్లో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని విద్యార్థులు 400 చెల్లించి మళ్లీ తాజాగా దోస్త్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాజారాం 9398411051,9246607551 సంప్రదించండి.