Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సికింద్రాబాద్
హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ గుర్తింపు ఎన్నికల్లో హెచ్డ బ్ల్యూఎస్, ఎస్బోర్డు స్టాఫ్, వర్కర్స్ యూనియన్ను గెలిపిస్తేనే కార్మి కులకు న్యాయం జరుగుతుందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.నర్సింహా జలమండలి కార్మికు లకు తెలిపారు.గురువారం సికింద్రాబాద్ పరిధిలోని చిలుకలగూడ, సీతాఫల్మండి, శ్రీనివాసనగర్, తార్నాక, మారేడ్పల్లి, ప్రకాష్నగర్ తదితర డివిజన్లలో పనిచేస్తున్న జలమండలి కార్మికుల సమావేశం పద్మారావునగర్లోని చిలుకలగూడ డివిజన్ వాటర్ బోర్డు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రానున్న ఎన్నికల్లో సత్యనారాయణ అధ్యక్షు లుగా ఉన్న ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాన్ని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు రాకేష్సింగ్, యూనియన్ ప్రధాన కార్యదర్శి రమేష్, నాయకులు మురళీకృష్ణ, జంగయ్య, రాజయ్య, బాబు, ఆనంద్, సత్యనారాయణ, దేవదాస్, అశోక్, పెంటయ్య పాల్గొన్నారు.