Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడ్మెట్
సీసీ కెమెరాలతో నేరా లకు బ్రేక్ వేయవచ్చునని జవహర్నగర్ డీఐ నర్సింగ్ రావు అన్నారు. గురువారం యాప్రాల్లోని భగత్సింగ్ నగర్లో ప్రవీణ్, రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను డివిజన్ కార్పొరేటర్ శ్రీదేవితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం కాలనీవాసులకు వాటి ఉపయోగంపై అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని కాలనీలలో, బస్తీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమలో మధుసూధన్రెడ్డి, జెడ్పీస్కూల్ ప్రిన్సిపాల్ బాపిరెడ్డి, రత్న, నందిని, సుశీల, మోహన్, బబ్లూ, జ్యోత్న్స, హారతి, విజయలక్ష్మి, రాజు పాల్గొన్నారు.