Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడ్మెట్
నేరేడ్మెట్ డివిజన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని కార్పొరేటర్ శ్రీదేవి అన్నారు. గురువారం ఆర్కెపురం ఆఫీసర్స్ కాలనీలో రూ.10 లక్షల వ్యయంతో పార్కు కాంపౌండ్ వాల్, ప్రహరీ పనులను ప్రారంభించారు. అనంతరం కాలనీ వాసులతో కలిసి బస్తీల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూగర్భ డ్రయినేజీ అస్తవ్యస్తంగా ఉందని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురావడంతో దాన్ని పరిష్కరించేందుకు అధికారులతో చర్చిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీకే.హన్మంతరావు, బద్దం పరుశురాంరెడ్డి, గోపుర మణారెడ్డి, శంకర్రావు, చిందం శ్రీనివాస్, యామిని కుమార్, బాబురావు, టిక్కం, సూర్యారావు, నారాయణరెడ్డి, జాన్, జ్యోత్స్న, కిషన్రెడ్డి పాల్గొన్నారు.