Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడ్మెట్
సంక్షేమాభివృద్ధే తమ ధ్యేయమని మౌలాలి డివిజన్ కార్పొరేటర్ ఫాతిమా అమీనుద్దీన్ అన్నారు. గురువారం షఫినగర్లో భూగర్భ డ్రయినేజీ పనులను అధికారులతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం బస్తీల్లో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న తాగునీరు, భూగర్భ డ్రయినేజీ, వీధిదీపాలు, రోడ్లు తదితర సమస్యల పరిష్కారానికి అధికా రులతో చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి అమీనుద్దీన్, డివిజన్ అధ్యక్షుడు భాగ్యనందరావు, డీఈ సువర్ణ, ఏఈ సృజనశ్రీ, సూపర్వైజర్ సుబ్రహ్మణ్యం, స్థానికులు పాల్గొన్నారు.