Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు .కీసర మండలం, తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన క్రిష్ణారెడ్డి గత కొంతకాలంగా ఆనారోగ్యంతో ఆస్పత్రిలో ఉండి సీఎం రిలీఫ్ఫండ్ కోసం దరఖాస్తు చేసుకు న్నాడు. బాధితుడికి రూ.60 వేల చెక్కు మంజూయి కావడంతో గురువారం మంత్రి మల్లారెడ్డి చెక్కును అతనికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జలాల్పురం సుధాకర్రెడ్డి, తిమ్మాయిపల్లి సర్పంచ్ పెంటయ్య, నాగారం మాజీ సర్పంచ్ కౌకుంట్ల చంద్రారెడ్డి, సహకర సోసైటీ డైరెక్టర్ గురుగుల మల్లేష్, టీఆర్ఎస్ నేతలు అమరేందర్రెడ్డి, గుర్రం లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.