Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మల్కాజిగిరి
మౌలాలి కమాన్ వద్ద విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మహ్మద్ ముజా ఫర్పై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గురువారం అదే రహదారి గుండా ఓ బైకుపై ట్రిపుల్రైడ్ వెళ్తుండగా కానిస్టేబుల్ ఫోటో తీశాడు. దీంతో వాహనదారులు సయ్యద్ జాఫర్, మహ్మద్ బేగం, సాదీహుస్సెన్లు కానిస్టేబుల్ను చితకబాదారు. వెంటనే మల్కాజిగిరి ట్రాఫిక్ సీఐ మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.