Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంబర్పేట: ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న నారాయణగూడలోని జాగతి డిగ్రీ అండ్ పీజీ కళాశాల దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరడానికి ఈ నెల 28వ తేదీన ఆదివారం ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నట్టు స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ టి.జయపాల్రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్ఎస్సీ, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయిన వారు, ఎటువంటి విద్యార్హత లేని 18 సంవత్సరాలు నిండిన వారు నేరుగా బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎల్ఎఫ్ తదితర డిగ్రీ కోర్సులలో, డిగ్రీ పాస్ అయిన వారు ఎంబీఏ, ఎంసీలలో ఆడ్మిషన్లకోసం జరిగే ప్రవేశ పరీక్షను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పీజీలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, బీఎల్ఐఎస్సీ, ఎంఎస్డబ్ల్యూ తదితర కోర్సులలో అడ్మిషన్లు తీసుకోవడానికి ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9550975288, 7036093888 సెల్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.