Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓయూ: దళిత ప్రొఫెసర్ను ఓయూ వీసీగా నియమించాలని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ఓయూ ఇన్చార్జి పల్లెర్ల సుధాకర్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఓయూ గెస్ట్ హౌస్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ఎన్నో సామాజిక ఉద్యమాలకు చైతన్యానికి, మేధోపరమైన చర్చలకు కేంద్ర బిందువైన ఉస్మానియా యూనివర్సిటీకి వీసీగా దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్లను నియమించకపోవడం దళిత సమాజాన్ని అవమానించడమే అని అన్నారు. ఇప్పటివరకు వీసీ లుగా అగ్రవర్ణ, ఇతర సామాజిక వర్గాలకు చెందిన ప్రొఫెసర్లు ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షులు శేఖర్, సెక్రెటరీ సంజీవ్, మురళి కృష్ణ, చంటి, శ్రీకాంత్, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.