Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిక్మెట్ కార్పొరేటర్ హేమలత
నవతెలంగాణ - అడిక్మెట్
ఆరోగ్యమే మహాభాగ్యం అని, ప్రజలు తమ ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా ఎప్పటికప్పుడూ హెల్త్ చెకప్ చేయించుకోవాలని అడిక్మెట్ డివిజన్ కార్పొరేటర్ హేమలత అన్నారు. గురువారం డివిజన్లోని పోచమ్మ బస్తీ కమిటీ హాల్ లో నిర్వహించిన జీహెచ్ఎంసీ హెల్త్ క్యాంప్నకు ముఖ్యఅతిథిగా ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవఖానా, హెల్త్ క్యాంపు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ తప్రెసిడెంట్ శ్రీను నాయకులు శ్రీకాంత్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.