Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్చరల్ రిపోర్టర్ : తెలంగాణ సాహితీకీర్తిమూర్తి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి అని తెలంగాణ సమాచార హక్కు కమిషనర్ బుద్ధా మురళి ప్రశంసించారు. త్యాగరాయ గానసభలోని జీహెచ్.రావు కళా మందిరంలో ఎందరో మహానుభావులు శీర్షికన నిర్వహిస్తున్న మహనీయుల జయంతి, వర్థంతుల కార్యక్రమంలో భాగంగా గురువారం కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి జయంతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా మురళి పాల్గొని మాట్లాడుతూ.. ఉద్దండపండితులు లక్ష్మణశాస్త్రి సంభాషణా చతురుడు, హాస్యప్రియుడని పేర్కొన్నారు. వివేకవర్థిని హైస్కూల్లో తెలుగు పండితుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఆయనకు తెలుగుతో పాటు సంస్కృత, హిందీ, ఉర్దూ, తమిళం, మరాఠి, కన్నడ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం ఉండేదని వివరించారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్ధనమూర్తి అధ్యక్షత వహించిన సభలో ప్రముక రచయిత రమణ వెలమకర్ణి, సంగీతోపాధ్యాయులు సి.సంయుక్త పాల్గొన్నారు.