Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి ఏ.క్రిష్ణ నాయక్
నవతెలంగాణ-ధూల్పేట్
డ్రయినేజీ మురుగు నీటీ సమస్యలను పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం తగదని సీపీఐ(ఎం) జంగమ్మెట్ డివిజన్ కార్యదర్శి ఏ.క్రిష్ణనాయక్ అన్నారు. జంగమ్మెట్ డివిజన్ పరిధిలోని డ్రయినేజీ మురుగునీటి సమస్యలను పరిష్కరించాలని పలు మార్లు అన్లైన్ ఫిర్యాదులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. డ్రయినేజీ, మంచినీటీ సమస్యలను పరిష్కరించక పోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వాతావరణ మార్పులు, డ్రయినేజీ సమస్యలను బస్తీలలో ఏరులై పారుతున్న ఆధికారులు పట్టించుకోక పోవడంపై అగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్థానికులు అనారోగ్యాల బారీన పడుతున్నారని ఆరోపించారు. స్థానికంగా డ్రయినేజీ యంత్రాలతో తొలగించేందుక ప్రయత్నించిన అంతర్గత బస్తీలలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయన్నారు. దీనిపై ఆధికారులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేసిన స్పందించక పోవడంపై మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు ఫిర్యాదు చేసిన పట్టించుకోక పోవడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రయినేజీ మురుగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.