Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చాధర్ఘాట్
ముసారాంబాగ్ డివిజన్లోని ఆలయాల్లో బోనాల మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని కార్పొరేటర్ సునరితా రెడ్డి పేర్కొన్నారు. గురువారం డివిజన్లోని దేవాలయాలలో జరుగుతున్న బోనాల మరమ్మతు పనులను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బోనాల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేవాలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బోనాల నిర్వహించే ప్రాంతాలలో ఏలాంటి సమస్యలు ఉన్నత దృష్టికి తీసుకురావాలని వెంటనే పరిష్కారిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బోనాల ఉత్సవాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, అవసరమైన నిధులను కేటాయిస్తుందన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ, ఈఈ రాధిక, ఏఈ జమీల్, నాయకులు రఘునందన్రెడ్డి, అమిత్, దామోదర్, సాయి నగర్ కాలనీ అధ్యక్షులు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.