Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్పేట్
ఆశాడ మాసపు బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది చారిత్రక అక్కన్న మాదన్న బోనాల ఉత్సవాల జాతరను ఘనంగా నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. బోనాల ఉత్సవాలను పురష్కరించుకుని హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఉత్సవాల సందర్బంగా ఏలాంటి అ సౌకర్యాలు గురి కాకుండా వచ్చే భక్తులకు ఏర్పాటు చేశామాన్నారు. ఈ నెల 19నుంచి ప్రారంభవుతాయన్నారు. రోజు వారిగా నిర్వహించే కార్యక్రమాలను వివరించారు.