Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట
బడంగ్పేట మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఒక ఇంట్లో 40నుంచి 50వరకూ బోగస్ ఓట్లను నమోదు చేయించారని రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి, బాలాపూర్ సింగల్విండో మాజీ చైర్మన్ కొలను శంకర్రెడ్డి తెలిపారు. గురువారం బాలాపూర్ మండల తహాసీల్దార్ కార్యాలయంలో ఉన్న బోగస్ ఓట్లను తొలగించాలని కోరుతూ తహాసీల్ధార్ చంద్రశేఖర్గౌడ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... బడంగ్పేట్లో ఉన్న పలు కాలనీలో మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు ఒక ఇంటిపై 30, 40 మంది ఉన్నట్లు బోగస్ ఓట్లను ఏర్పాటు చేయించారని, వాటిని విచారణ చేపట్టి బోగస్ ఓట్లను తొలగించాలన్నారు. బాలాపూర్, బడంగ్పేట గ్రామాలలో ఖాళీ స్థలాలు, ప్లాట్లతో మనుషులు ఎవ్వరు లేకున్నా అక్కడ బోగస్ ఓట్లను నమోదు చేయించి రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో అక్రమంగా విజయం సాధించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే వాటిని తొలగించాలని తహసీల్దారును కోరారు.