Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ సంగీత ప్రశాంత్గౌడ్
నవతెలంగాణ-ఎల్బీనగర్
ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్గౌడ్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని బండ్లగుడ హిందు శ్మశాన వాటికలో అక్బారి శాఖ వారిచే ఏర్పాటు చేసిన హరితాహారం కార్యక్రమానికి ఆమె ముఖ్య అథిధిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... జీవరాశుల మనుగడ మ్కొలతోనే ముడిపడి ఉంటుందన్నారు. భవిష్యత్తు తరాలకు ఆస్తిపాస్తులు ఇవ్వకున్నా ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తే ఎంతో మేలన్నారు. ఈ కార్యక్రమంలో సుపరింటెడెంట్ ప్రదీప్, ఉప్పల్ సర్కిల్ సీఐ చంద్రశేఖర్, ఎస్.ఐ శ్రీనివాస్, నాగోల్ కల్లు గీత సహాకార సంఘం సభ్యులు కె.నరేందర్, చెర్కు జంగయ్య గౌడ్, మెట్టు సత్యనారాయణ, తూర్పాటి క్రిష్ణ కె.రాఘవేందర్, ఎన్. .రాఘవేందర్, శ్రవన్ పాల్గొన్నారు.