Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ ఆర్టీసీ డిప్యూటీ సీఏవో లవన్న
నవతెలంగాణ-బోడుప్పల్
ఖర్చులు తగ్గించి ఆదాయ మార్గాలపై దృష్టి సారించినప్పుడే ఆర్టీసీ అభివృద్ధి బాట పడుతుందని ఆర్టీసీ డిప్యూటి చీఫ్ అకౌంట్ అధికారి ఎం.లవన్న అన్నారు. గురువారం చెంగిచెర్ల ఆర్టీసీ డీపోను సందర్శించి ఆయన వివిధ విభాగాల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా లవన్న మాట్లాడుతూ.. ఆర్టీసీలో పని చేస్తున్న ప్రతీ ఉద్యోగి ప్రయాణికులను అకర్షించి సంస్థకు ఆదాయం సమకూర్చాలన్నారు. సంస్థ పురోగతికి ప్రతి ఉద్యోగి తన వంతుగా బాధ్యతగా పోదుపు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ వి.మల్లయ్య, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) శ్రీపతి కృష్ణ, అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్) ఆదినారాయణ, ఆడిటర్ సత్యనారాయణ పాల్గొన్నారు.