Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఏఎస్రావునగర్
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అనిల్కుమార్ అన్నారు. గురువారం ఈసీఐఎల్లోని నీలం రాజశేఖర్రెడ్డి భవన్లో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత విద్యావిధానం యువతకు ఉపాధి అవకాశాలు అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ..సరళీకరణ, ప్రయివేటీకరణ, ఆర్థిక సంస్థల ప్రక్షాళన మూలంగా ఉన్నత సమాజ పతనమైందని అన్నారు. భాతర రాజ్యాంగ సూత్రాలను అమలు పరచకుండా పాలకులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఉన్నత విద్యారంగం పట్ల దిక్సూచి ఉండాలని ప్రయివేటు , కార్పొరేట్ శక్తుల మాయజాలంలో అధికారులు, ప్రభుత్వం ఊగిసలాడుతుందని అన్నారు. రాష్ట్రంలో 6.20 లక్షల ఉద్యోగులు ఖాళీగా ఉన్నాయని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సత్యప్రసాద్, నాయకులు రాము, వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్మేంద్ర, విశాల్, ఈసీఐఎల్ అధ్యక్ష కార్యదర్శులు రాంరెడ్డి, మహేష్ పాల్గొన్నారు.