Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
రానున్న స్థానిక ఎన్నికల నిర్వహణ విధివిధానాలపై బోడుప్పల్ పురపాలక సంఘం కార్యాలయంలో అధికారులకు శిక్షణ ఇచ్చినట్టు పురపాలక కమిషనర్ అర్.ఉపేందర్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఎన్నికల అధికారి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి అదేవాల మేరకు బోడుప్పల్ పురపాలక కార్యాలయంలో ఎన్నికల శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ తరగతుల్లో శిక్షకులు జి.అశోక్కుమార్ (ఎస్ఎ)జి.మహేందర్(ఎస్ఎ)లు ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, జోనల్ అధికారులకు పురపాలక ఎన్నికలలో ఉండే విధులు, నిర్వహణ, ఫండమెంట్ రూల్స్పై శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు.