Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
కొండాపూర్ రైల్వే గేటు తెరవడంలో అఖిల పక్షనేతలు సంబురాలు జరుపుకున్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీలోని కొండాపూర్ రైల్వేగేటు మూసివే యడంతో కొండాపూర్, బాలాజీ నగర్, గాంధీనగర్, కాలనీవాసులకు 3కిలోమీటర్ల దూరం పెరిగిపో యిందని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని అఖిల పక్షం నాయకులు గత కొన్ని రోజులుగా మంత్రి మల్లారెడ్డి, రైల్వే జీఎం గజానన్ మాల్య, జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డిలకు వినతి పత్రం అందజేసిన విషయం విదితమే. జీఎం హామి మేరకు మరమ్మతు పనులను వేగవంతం చేసి గురువారం సాయంత్రం రైల్వేగేటు తెరిపించారు. దీనితో అఖిలపక్షం నాయకులు మంత్రికి, జీఎంకు, కలెక్టర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు చింతల యాదయ్య, సీఐటీయూ మండల కార్యదర్శి నార్కెట్పల్లి సబిత, టీడీపీ మండల అధ్యక్షులు వేముల సంజీవగౌడ్, సీపీఐ మండల కార్యదర్శి యూసుఫ్ బాబా, బీజేపీ జిల్లా నాయకులు గుండ్ల బాల్రాజ్, కాంగ్రెస్ నాయకులు సగ్గు అనిత, సగ్గు శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు బండారి అంజిగౌడ్, సిరాజ్, హరిశంకర్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యాక్షులు కళ్ళె శ్రీకాంత్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యాక్షులు పుట్ట లక్ష్మణ్ పాల్గొన్నారు.