Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్చరల్ వార్తలు
సాహిత్యాన్ని సామాజిక చైతన్యంకోసం ఆయుధంగా వాడిన వేదగిరి రాంబాబు నిత్యచైతన్యమూర్తి అని ప్రముఖ సాహితీవేత్త విహారీ అన్నారు. ఎంవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీత్యాగరాయ గానసభలోని కళా లలిత వేదికపై నెలనెలా నిర్వహించే డాక్టర్ యాదగిరి రాంబాబు సాహితీ వ్యక్తిత్వ చైతన్యంపై ప్రసంగ పరంపరలో గురువారం హాస్య కథానికా రచయితల సదస్సు నిర్వహించారు. కథకులు డాక్టర్ కేబీ లక్ష్మి, శంకరమంచి పార్థసారథి, బ్నింలు పాల్గొని మాట్లాడుతూ.. రాంబాబు రచనలు సున్నితమైన హాస్యం తొనికిసలాడేదని పేర్కొన్నారు. ఆయన వ్యక్తిత్వం నిజాయితీతో నిష్కల్మశంగా స్నేహప్రియంగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. యాదగిరి విజరుచంద్ర స్వాగతం పలికిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి తదితరులు రాంబాబు వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు.