Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్చరల్ వార్తలు
ఏకళలోనైనా, విద్యారంగంలోనైనా సాధనతోనే ప్రతిభావంతులవుతారని జవహార్ బాలభవన్ పూర్వ సంచాలకులు డాక్టర్ ఎంకే.రాము అన్నారు. ఉజ్వల సామాజిక సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాయ గానసభలోని కళాసుబ్బారావు కళావేదికపై నిర్వహిస్తున్న బంగారు తెలంగాణ బోనాల సంబరాల్లో భాగంగా మంగళవారం కూచిపూడి జానపద నృత్యప్రదర్శనలు వైభవంగా నిర్వహించారు. సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ రాము పాల్గొని మాట్లాడారు. గురువులను గౌరవించే శిష్యుల భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందన్నారు. కళాపోషకులు వైఎస్సార్ మూర్తి అధ్యక్షత వహించిన సభలో వై.రాజేంద్రప్రసాద్, సామాజికవేత్త కొత్త క్రిష్ణవేణి, గానసభ అధ్యక్షుడు కళా జనార్ధనమూర్తి పాల్గొన్న సభకు అధ్యక్షురాలు లక్ష్మి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాట్య గురువులు ప్రియదర్శిని, రాధిక, హరిప్రియగౌడ్లను సత్కరించారు.