Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్చరల్ వార్తలు
తెలంగాణ జానపద కళలను అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన గోపాల్రాజ్భట్ జానపద కళాబ్రహ్మా అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ.రమణ కొనియాడారు. రవీంద్రభారతిలో భాషాసాంస్కృతిక శాఖ సౌజన్యంలో దక్షిణాత్య ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్ గోపాల్ భట్ జీవన సాఫల్య, యువ పురస్కార ప్రధానోత్సవం రవీంద్రభారతిలో గురువారం నృత్యభరితంగా నిర్వహించారు. డాక్టర్ కేవీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. గోపాల్రాజ్ భట్ అచ్చమైన లంబాడి, గిరిజన కళాకారులతో దేశంలోని వివిధ నగరాల్లో ప్రదర్శనలిప్పించారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు బి.శివకుమార్ మాట్లాడుతూ.. గోపాల్రాజ్భట్ సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. వేదికపై ప్రముఖ ఖదక్ కళాకారుడు రాఘవరాజ్భట్ తదితరులు పాల్గొనగా రంగస్థల ప్రముఖుడు డాక్టర్ కోట్ల హన్మంతరావు అధ్యక్షతవహించారు. డాక్టర్ అనితారావు స్వాగతం పలికారు. దురిశెట్టి రామయ్య, మూర్తి జగన్నాథంలకు జీవన సాఫల్య పురస్కారం, అందాసి నారాయణకు యువ పురస్కారం అతిథులు బహుకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బృంద నృత్యపోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.