Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవీపీఆర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన సూర్యపేట్ జిల్లా వాసులు
నవతెలంగాణ- సిటీబ్యూరో/ బంజారాహిల్స్
జూబ్లీహిల్స్ జీ.వి.పి.ఆర్ కార్యాలయం ఎదుట గురువారం సూర్యపేట్కు చెందిన కాంట్రాక్టర్లు ధర్నా చేపట్టారు. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుల పనులు పూర్తి చేయించుకుని బిల్లులను ఇవ్వకుండా..20 నెలలుగా అధికారులు వేధిస్తున్నారని కాంట్రాక్టర్లు ఆనందరావు, శంకర్లు ఆరోపించారు. గత నెల జీవీపీఆర్ ఎదుట కుటుంబసభ్యులతో నిరసన తెలిపినట్లు చెప్పారు. అధికారులు కొంత వ్యవధిలో బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చి నేటి వరకు అమలు జరుపలేదని.. చేసేదేమి లేక చెప్పుకునే దారిలేక పందులతో నిరసనకు దిగినట్టు తెలిపారు. తాము పూర్తిచేసిన పనులతో 18 గ్రామాల దాహార్తి తీరుతుందని అన్నారు. పనులు పూర్తి చేసినా కంపెనీ తమకు చెల్లించాల్సిన నగదు కోటి ఇరవై లక్షలు రుపాయలు ఇవ్వకుండా మోసం చేస్తుందని అన్నారు. ప్రభుత్వం బాధ్యత తీసుకుని తమకు న్యాయం జరిగెలా చూడాలని కోరారు.